News June 18, 2024
కాజీపేట- సికింద్రాబాద్: మూడేళ్లుగా పట్టాలెక్కని కవచ్!
KZPT- SEC మార్గంలో 2 రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినప్పుడు.. వాటికవే గుర్తించి వేగం తగ్గించుకొని నిలిచిపోయే ‘కవచ్ వ్యవస్థ’ ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2022 మార్చి 4న రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ వికారాబాద్-లింగంపల్లి మధ్య ప్రయోగాత్మకంగా కవచ్ వ్యవస్థను పరిశీలించి విజయవంతం చేశారు. ఆ తర్వాత KZPT- SEC మార్గంలో కవచ్ను అభివృద్ధి చేస్తారని ప్రకటించారు. కానీ మూడేళ్లుగా జాడ కనిపించడం లేదు.
Similar News
News October 6, 2024
GREAT.. జనగామ: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు
ఒకే ఇంట్లో అన్నా చెల్లెలు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్య కొడుకు మహేశ్ కుమార్, కూతురు మౌనికలు ఇటీవల విడుదలైన డీఎస్సీ(SGT) ఫలితాల్లో వరుసగా 5, 15వ ర్యాంక్లు సాధించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి బీడీలు చేసి వీరిని చదివించింది.
News October 6, 2024
మహాలక్ష్మి అలంకరణలో భద్రకాళి అమ్మవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఆలయ అర్చకులు అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
News October 6, 2024
ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య
జనగామ జిల్లా వాసిని ఉగాండాలో హత్య చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమలేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్గా ఉగాండాలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడే పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో తిరుమలేశ్పై కాల్పులు జరపడంతో ప్రాణాలు వదిలాడు. అనంతరం సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.