News March 14, 2025

కాటారం: ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిక్కని పెద్దపులి

image

కాటారం మండలం వీరాపూర్ అడవుల్లో లేగ దూడపై దాడి చేసి చంపిన పెద్దపులి మళ్లీ ఇప్పటి వరకు అటువైపు రాలేదు. లేగ దూడను చంపిన ప్రదేశంతో పాటు పలు ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా పెద్దపులి చిక్కలేదని తెలుస్తోంది. లేగ దూడను చంపి అన్నారం వైపుగా వెళ్లినట్లు అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లొద్దని, పులికి హాని కలిగించే చర్యలు చేపట్ట వద్దని హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 8, 2025

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

2018 నవంబర్ 18న భార్య లక్ష్మీ దేవిని గొంతు నులిమి చంపిన కేసులో కర్నూలు శివప్ప నగర్‌కు చెందిన ముద్దాయి శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. ముద్దాయి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసులు అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

News November 8, 2025

రబీ వరి సాగు విధానం.. విత్తన మోతాదు

image

☛ నారు నాటే పద్ధతి – 20 కిలోల విత్తనం అవసరం.
☛ ఎద పద్ధతి – 12-15 కిలోలు(మండి కట్టిన విత్తనం), 25-30 కిలోలు( పొడి విత్తనం)
☛ శ్రీవరి సాగు పద్ధతి – 2 కిలోల విత్తనం అవసరం.
☛ యాంత్రిక పద్ధతిలో వరి సాగుకు 10-12 కిలోల విత్తనం
☛ బెంగాల్ పద్ధతిలో వరి సాగు 8-10 కిలోల విత్తనం కావాలి.
☛ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. కిలో పొడి విత్తనాలకు 3గ్రాముల కార్బండిజమ్‌తో శుద్ధి చేయాలి.

News November 8, 2025

ఈనెల 9న ప్రారంభం కానున్న KU దూరవిద్య పీజీ కాంట్రాక్టు తరగతులు

image

కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ కాంట్రాక్టు తరగతులు నవంబరు 9 నుంచి ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ప్రొ.బి.సురేశ్ తెలిపారు. నవంబరు 9, 11, 23, 30తో పాటు డిసెంబరు 7, 13, 14, 21, 28వ తేదీల్లో ఉ.10 గం.కు తరగతులు జరుగుతాయన్నారు. ఎంఏ, ఎంకామ్ కోర్సులు కేయూ కేంద్రం, మంచిర్యాల, ఖమ్మం, మణుగూరు తదితర అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.