News March 23, 2025

కానూరులో వ్యభిచార గృహంపై దాడి

image

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Similar News

News March 24, 2025

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత

image

MMTS రైలు <<15866506>>ఘటనపై<<>> MLC కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. మహిళా భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నా’ అని తెలిపారు.

News March 24, 2025

NGKL: ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 10,537 మంది హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసే విధానాన్ని పరిశీలించారు. డీఈఓ చీఫ్ సూపరింటెండెంట్‌లకు పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేందుకు సూచనలు ఇచ్చారు.

News March 24, 2025

ధర్పల్లి: పది పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

image

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

error: Content is protected !!