News August 24, 2025

కామారెడ్డిలో రేపు ప్రజావాణి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News August 25, 2025

అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరంలో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరిలో భారీ వర్షాలు, ఇతర చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, KMM, ఉమ్మడి ADB, వరంగల్, KNR, నల్గొండ, MBNRలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 25, 2025

HYD: ఆగస్టు 31న అనంతగిరి హిల్స్ బర్డ్ వాక్..!

image

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది పక్షుల ప్రేమికులు పాల్గొన్నారు. పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. తదుపరి బర్డ్ వాక్ ఆగస్టు 31న అనంతగిరి హిల్స్‌లో జరగనుంది.

News August 25, 2025

ఇవాళ అందుబాటులోకి DSC కాల్ లెటర్లు

image

AP: DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కాల్‌లెటర్లు నేటి నుంచి అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఈరోజు నుంచే వెరిఫికేషన్ చేపట్టాలని భావించినా, సాంకేతిక ఇబ్బందుల కారణంగా కాల్ లెటర్ల జారీ ఆలస్యంతో వాయిదా వేసింది. మొత్తం 16,347 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితా సిద్ధం చేసి పోస్టింగ్‌ ఇస్తారు.