News October 30, 2025

కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సంఘానికి 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం నిర్ణయించామన్నారు. ఇది రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని తెలిపారు.

Similar News

News October 30, 2025

AP న్యూస్ అప్‌డేట్స్

image

✦ నవంబర్ 1న లండన్‌కు CM చంద్రబాబు.. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే CII సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న CM
✦ ఏటా NOV 10న రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్ జయంతి
✦ YCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో నేడు జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. మొంథా తుఫాన్ ప్రభావంపై చర్చ
✦ రాజధాని రైతులకు రాబోయే 4 నెలల్లో పెండింగ్ ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు పూర్తి: మంత్రి నారాయణ

News October 30, 2025

ఆలస్యంగా ఎందుకు నిద్ర లేవకూడదు?

image

మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించేవారు. వ్యవసాయం, చేతిపనులతో భూమితో బంధాన్ని కలిగి ఉండేవారు. ఆ జీవన విధానం వారికి ప్రశాంతతను ఇచ్చేది. కానీ నేడు ఉద్యోగాల వల్ల ఆ పద్ధతి దూరమవుతోంది. ఆధునిక జీవనంలో ఇంట్లో ఖాళీ సమయం పెరిగి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక బద్ధకస్తులమవుతున్నారు. శారీరక శ్రమ, ప్రకృతితో అనుబంధం లేకపోవడం వల్ల ఈ నిగ్రహాన్ని కోల్పోతున్నాం. అందుకే మంచిది కాని ఈ అలవాటును వదలాలి. <<-se>>#JEEVANAM<<>>

News October 30, 2025

రాబోయే 2-3 గంటల్లో వర్షం

image

TG: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మీ ప్రాంతంలో వాన కురుస్తోందా?