News February 8, 2025

కామారెడ్డి: ఆ స్తంభానికి కరెంట్ కనెక్షన్ లేదు: డిపో మేనేజర్

image

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్‌లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని<<>> సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్‌లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.  

Similar News

News February 26, 2026

MBNR: రాజ్ కోట్ – మహబూబ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్ల పొడిగింపు.!

image

ఉమ్మడి జిల్లా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజ్‌కోట్ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ మార్చి 2026 వరకు పొడిగించింది. రైలు నం.09575 (రాజ్‌కోట్-మహబూబ్ నగర్) ప్రతి సోమవారం, రైలు నం.09576 (మహబూబ్ నగర్-రాజ్‌కోట్) ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి. మార్చి నెలలో ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

News February 26, 2026

కడప జిల్లాలో ఆహార తనిఖీకి సిబ్బంది ఎక్కడ?

image

కడప జిల్లా పుడ్ సేప్టీ కంట్రోల్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో హరిత ఒక్కరే ఉన్నారు. ఈమెకు సహాయంగా అసిస్టెంట్ పుడ్ కంట్రోల్ అధికారి రామచంద్రన్ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే జిల్లా అంతటా ఆహార నాణ్యత తనిఖీలు, శాంపిల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కార్యాలయంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. ఫీల్డ్ స్టాప్ కొరతతో తనిఖీలు చేయలేకపోతున్నామన్నారు.

News February 26, 2026

కర్నూలు: హత్య కేసులో నలుగురి అరెస్టు

image

కర్నూలు ఖండేరి వీధికి చెందిన మనోహర్(40) హత్య కేసులో నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో మనోహర్‌పై పట్టణానికి చెందిన తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. నిందితుల నుంచి ఆటో, రెండు కత్తులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు.