News June 15, 2024
కామారెడ్డి: ఎనిమిదేళ్ల తర్వాత తెరుచుకున్న పాఠశాల

విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో ఎనిమిదేళ్ల క్రితం కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి(జి) ప్రాథమిక పాఠశాలను అప్పటి ప్రభుత్వం మూసేసింది. దీంతో విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత తిమ్మక్ పల్లి పాఠశాలను తెరిపించారు.
Similar News
News November 8, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025
MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.


