News October 25, 2025
కామారెడ్డి: కులం పేరుతో దాడి..13 మందికి జైలు శిక్ష

కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో 13 మంది నిందితులకు NZB కోర్టు శిక్ష విధించింది. సదాశివనగర్(M) అమర్లబండలో రాజేశ్వర్ తన ఇంట్లో భోజనం చేస్తుండగా రతన్ కుమార్తో పాటు మరో 12 మంది కులం పేరుతో దుషించి దాడి చేశారు. ఈ కేసును కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు A1 రతన్ కుమార్కు 3ఏళ్ల జైలు, రూ.7,200 జరిమానా మిగతా వారికి ఏడాది జైలు, రూ.4,200 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
Similar News
News October 25, 2025
NZB: యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

భారత ఐక్య విద్యార్థి సమాఖ్య (USFI) రాష్ట్ర మహాసభలు శనివారం NZBలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఖలీల్ వాడి, బస్టాండ్ మీదుగా మహాసభ ప్రాంగణం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ రాష్ట్ర మహాసభలు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. గత విద్యార్థి ఉద్యమాలపై సమీక్ష చేసి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
News October 25, 2025
NZB: జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

నిజామాబాద్-36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు, బోధన్-18 మద్యం దుకాణాలకు 455, ఆర్మూర్-25 మద్యం దుకాణాలకు 618, భీమ్గల్-12 మద్యం దుకాణాలకు 369, మోర్తాడ్-11 మద్యం దుకాణాలకు 381 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా NZB094-(ఏర్గట్ల) 96, NZB066-(ఆలూరు) 74, NZB097-(వేల్పూర్) 69 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరించారు.
News October 25, 2025
నిజామాబాద్ రూపురేఖలు మారాలి: NZB కలెక్టర్

నిజామాబాద్ నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా నగర పాలక సంస్థ పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగర పాలక సంస్థ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, బల్దియా ఆస్తుల పరిరక్షణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై చర్చించారు.


