News February 20, 2025
కామారెడ్డి: కొనసాగుతున్న కంటి వైద్య శిబిరం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కంటి వైద్య శిబిరం కొనసాగిస్తున్నట్లు అప్తాల్మిక్ వైద్యులు లింబాద్రి, రవీందర్, రంజిత తెలిపారు. కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, KGBV, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు రీస్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. పలువురికి అద్దాలు వాడాలని సూచించమన్నారు.
Similar News
News January 7, 2026
సింగరేణి హాకీ పోటీల్లో శ్రీరాంపూర్ జట్టు విజయం

డబ్ల్యూపీఎస్ & జీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి స్థాయి హాకీ పోటీలు ఈ రోజు ముగిశాయి. ఫైనల్స్లో శ్రీరాంపూర్ జట్టు, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా జట్టు తలపడ్డాయి. ఈ పోటీల్లో శ్రీరాంపూర్ జట్టు విజయం సాధించింది. ముగింపు వేడుకలకు ఆర్జీ 1 జీఏం డీ.లలిత్ కుమార్ హాజరై ట్రోఫీ అందజేశారు. శ్రీరాంపూర్ జట్టు కోల్ ఇండియా పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.
News January 7, 2026
చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల షెడ్యూల్ ఇదే

ఈ నెలలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26, క్రీడా పోటీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరగనున్నాయి.
News January 7, 2026
ఒప్పో సబ్ బ్రాండ్లుగా రియల్మీ, వన్ ప్లస్.. కారణమిదే!

చైనా మొబైల్ కంపెనీలు రియల్మీ, వన్ ప్లస్ ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్లుగా మారనున్నాయి. ఒప్పో సారథ్యంలోనే ఇవి పని చేయనున్నాయి. నిజానికి ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్మీ కంపెనీలు BBK ఎలక్ట్రానిక్స్కు చెందినవి. తాజా నిర్ణయంతో వేర్వేరుగా రీసెర్చ్&డెవలప్మెంట్, సేల్స్, లాజిస్టిక్ టీమ్స్ అవసరం ఉండదు. వనరులను సమీకరించుకుని, ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లో మరింత వృద్ధి చెందాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి.


