News February 20, 2025
కామారెడ్డి: కొనసాగుతున్న కంటి వైద్య శిబిరం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కంటి వైద్య శిబిరం కొనసాగిస్తున్నట్లు అప్తాల్మిక్ వైద్యులు లింబాద్రి, రవీందర్, రంజిత తెలిపారు. కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, KGBV, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు రీస్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. పలువురికి అద్దాలు వాడాలని సూచించమన్నారు.
Similar News
News January 7, 2026
పదో తరగతి పరీక్షలకు 72 కేంద్రాలు: డీఈవో

అల్లూరి, పోలవరం జిల్లాల్లో 72 కేంద్రాల్లో 11,985 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవో డా.కె.రామకృష్ణారావు తెలిపారు. అడ్డతీగల, రాజవొమ్మంగి పాఠశాలలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.
News January 7, 2026
మిల్లర్లు సహకరించాలి: నెల్లూరు జేసీ

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మిల్లర్లు సహకరించాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్స్తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీకి సంబంధించి ధాన్యం సేకరణ, బ్యాంకు గ్యారంటీలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
News January 7, 2026
డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.


