News November 19, 2025
కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.
Similar News
News March 4, 2026
కడప: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో శనగ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు.?

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, డీసీఎంఎస్ను ఏజెన్సీగా నియమించుకుంది. డీసీఎంఎస్ వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21మంది ప్రవేట్ వారిని ఇన్ఛార్జ్లుగా పెట్టారు. వీరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
News March 4, 2026
సంగారెడ్డి: ‘మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి’

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ప్రత్యేక ‘హెల్త్ ప్రొఫైల్’ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా ఈ స్క్రీనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా ప్రతి మహిళకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని మంత్రి వెల్లడించారు.
News March 4, 2026
భైంసాలో ఎస్పీ గ్రీవెన్స్.. సత్వర పరిష్కారం

ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి 6 ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. షీ టీమ్ కౌన్సిలింగ్ ద్వారా కుటుంబ వివాదాలను అక్కడే పరిష్కరించారు. నిర్మల్ వెళ్లే దూరాభారం తప్పడంతో బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆమె సూచించారు.


