News March 2, 2025
కామారెడ్డి: గెలుపుపై ఎవరి అంచనాలు వారివే..

ఉమ్మడి NZB, KNR, MDK, ADB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
Similar News
News November 1, 2025
వరంగల్: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. అయితే, కృతిమ గర్భం ద్వారా మేలు జాతి రకాలైన దూడలు జన్మిస్తాయని, కృత్రిమ ఏఐ ద్వారా ఈ దూడలు జన్మించాయని గోపాల మిత్ర డా.అక్బర్ పాషా తెలిపారు. దీంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.
News November 1, 2025
RECORD: T20Iల్లో అత్యధిక పరుగులు

అంతర్జాతీయ T20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (4,234) నిలిచారు. నిన్న SAతో జరిగిన రెండో T20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 T20 WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News November 1, 2025
హాట్ టాపిక్గా సీఎంకు స్వాగతం పలికిన MLA దొంతి సీన్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు దెబ్బతినడంతో పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కి వచ్చారు. సీఎంకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటిసారిగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వరంగల్కు సీఎం ఎప్పుడొచ్చినా ఆ కార్యక్రమాల్లో దొంతి కనిపించలేదు. కానీ, మొదటిసారి రావడంపై హాట్ టాపిక్గా మారింది.


