News November 20, 2025

కామారెడ్డి జిల్లాకు మంత్రి సీతక్క

image

మంత్రి సీతక్క నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉ.10:30 గంటలకు భిక్నూర్ చేరుకుంటారు. భిక్నూర్, కామారెడ్డి AMC భవనాల వద్ద టాయిలెట్ బ్లాక్, కాంపౌండ్ వాల్ తదితర పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, KMR మునిసిపాలిటీ పరిధిలోని వార్డుల్లో CC రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు వంటి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. లైబ్రరీ ఉత్సవాల సందర్భంగా గ్రంథాలయ కార్యాలయంలో పుస్తకాలను పంపిణీ చేస్తారు.

Similar News

News November 22, 2025

HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

image

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.

News November 22, 2025

రేపు హనుమకొండలో హాఫ్ మారథాన్

image

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించబోయే హాఫ్ మారథాన్‌లో పాల్గొనే వారికి కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి పాసులను అందజేశారు. ఓరుగల్లు నగరంలో మొదటి సారి నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్‌ను విజయవంతం చేయాలన్నారు. కాళోజీ కళాక్షేత్రం నుంచి మారథాన్ ప్రారంభమై ఫారెస్ట్ ఆఫీస్, ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ మీదుగా మళ్లీ కాళోజీ కళా క్షేత్రం వరకు మారథాన్ జరగనుంది.

News November 22, 2025

సింగూర్ ప్రాజెక్టు పరిశీలించనున్న అధ్యయన కమిటీ

image

సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూర్ డ్యాంను నేడు అధ్యయన కమిటీ పరిశీలించనున్నట్లు ఐబీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతులపై సమాలోచనలు, మరమ్మతులకు డ్యాం ఖాళీ చేయాలా.. వద్దా.. అనే అంశంపై పరిశీలిస్తారు. డ్యామ్ ఖాళీ చేస్తే మూడు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని జలమండలి అధికారులు అంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధ్యయన కమిటీ నిర్ణయం తీసుకోనుంది.