News April 2, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మద్నూర్ మండలం సోమూర్లో 39.7°C ఉష్ణోగ్రత నమోదైంది. సర్వపూర్లో 39.2°C, పెద్ద కొడప్గల్ 39.1°C, మేనూర్, గాంధారిలో 39.0°C, జుక్కల్లో 38.9°C, నిజాంసాగర్లోని మాక్డూంపూర్, నస్రుల్లాబాద్ 38.8°C, బిచ్కుంద 38.7°C బీర్కూర్ 37.8 °C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News February 15, 2026
KRI: ఆవుల కోసం గోశాలలు.. ప్రజలకు ఉపశమనం

ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రోడ్లపై తిరిగే ఆవుల కోసం గోశాలలు నిర్మించనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. షెడ్ల నిర్మాణానికి ఒక్కో మున్సిపాలిటీకి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో శనివారం ప్రకటించారు. గుడివాడ, ఉయ్యూరు, పెడన, తాడిగడప, మచిలీపట్నం, విజయవాడ, జగ్గయ్యపేట, కొండపల్లి ప్రాంతాల్లో షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
News February 15, 2026
బంగ్లా ప్రయోజనాలకే ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

బంగ్లాదేశ్, ప్రజల ప్రయోజనాలే తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘ఈ గెలుపు బంగ్లాది. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం. హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నా’ అని చెప్పారు. తాజా ఎన్నికల్లో BNP <<19134014>>భారీ మెజారిటీ<<>>తో గెలవడం తెలిసిందే.
News February 15, 2026
కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.


