News December 28, 2025
కామారెడ్డి జిల్లాలో గ్రామ పాలన ఆఫీసర్స్ కమిటీ ఎన్నిక

గ్రామ పాలన ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్ పిలుపుతో కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముదం చిరంజీవి ఆధ్వర్యంలో ఓటింగ్ విధానంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా వెంకటేశ్ ఎన్నికయ్యారు. కొత్త కమిటీ జిల్లా స్థాయిలో గ్రామ పాలన ఆఫీసర్ల సమస్యల పరిష్కారానికి పనిచేయనుంది.
Similar News
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి ప్రత్యేకతలివే..

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసంలో దీనిలో తీపిదనం ఎక్కువ. దీని కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండటం వల్ల పశువులు సులువుగా, ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఈ గడ్డి చాలా గుబురుగా, దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.
News December 29, 2025
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి మండిపల్లి..!

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చడం దాదాపు ఖరారైంది. ఇదే అంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈక్రమంలో మంత్రి మండిపల్లి కన్నీటి పర్యంతం కాగా.. ఆయనను సీఎం చంద్రబాబు ఓదార్చరని సమాచారం. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం మదనపల్లె అవుతుందని సమాచారం.
News December 29, 2025
ఆరావళి కొండల నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే!

ఆరావళి కొండల కొత్త నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో పాత ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తూ అప్పటివరకు మైనింగ్ పనులు ఆపాలని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.


