News December 24, 2025
కామారెడ్డి జిల్లాలో తగ్గిన మహిళా సంబంధిత నేరాలు

కామారెడ్డి జిల్లాలో మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. SP రాజేష్ చంద్ర అందించిన వార్షిక నివేదిక ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది మహిళా సంబంధిత నేరాలు తగ్గాయి. 2024లో 622 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 585కి తగ్గింది. ఈ ఏడాది 16 హత్యలు, 2 వరకట్న మరణాలు, 67 రేప్ కేసులు నమోదయ్యాయి. అలాగే గృహ హింస కారణంగా 2 ఆత్మహత్యలు, 247 గృహ హింస కేసులు, 109 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
Similar News
News December 25, 2025
కర్నూలు: 9025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 9,025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానాతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
News December 25, 2025
బాబువన్నీ చిల్లర రాజకీయాలే: కాకాణి

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు కోటి సంతకాలు చేసినా CM లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని YCP నేత కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. ‘పేదలకు మేలు చేసేలా జగన్ వైద్యరంగాన్ని అభివృద్ధి చేశారు. వాటిని నీరుగార్చి ప్రైవేటుతో మేలుచేస్తానంటే ఎవరూ నమ్మరు. ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ నావి హుందా పాలిటిక్స్ అని CBN అనడం హాస్యాస్పదం’ అని ఎద్దేవా చేశారు.
News December 25, 2025
పిట్ ఎన్డీపీఎస్ చట్టం ఎప్పుడు ప్రయోగిస్తారంటే?

➤గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలను ముందస్తుగా అడ్డుకోవడానికి తీసుకొచ్చిన కఠిన చట్టం.
➤నిందితుడిని కోర్టు విచారణ లేకుండానే ముందస్తు నిర్బంధం చేయవచ్చు.
➤సమాజానికి ప్రమాదంగా మారిన వారిపై మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.
➤గరిష్ఠంగా ఏడాది వరకు జైలులో నిర్బంధం చేయవచ్చు.
➤శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు ముప్పు ఉంటే ప్రభుత్వం ఈ చట్టం అమలు చేస్తుంది.


