News December 18, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

* కామారెడ్డి: ఎన్నికల పరిశీలకుడికి వీడ్కోలు పలికిన కలెక్టర్
* జుక్కల్: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ బిజెపి నాయకులు
* కామారెడ్డి: ఎన్నికల్లో ఉద్యోగులు అంకితభావంతో పనిచేశారు
* బిక్కనూర్: పెండింగ్ బకాయిలు చెల్లిస్తేనే లెప్రసి సర్వే నిర్వహిస్తాం
* కామారెడ్డి: మీనాక్షి నటరాజన్‌ను కలిసిన షబ్బీర్ అలీ
* దోమకొండ: పెద్దపులి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి

Similar News

News December 29, 2025

నిజామాబాద్: నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌ కిరణ్

image

నిజామాబాద్ పట్టణానికి చెందిన శ్రీనికేష్ కిరణ్ 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.

News December 29, 2025

PHOTOS: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

image

AP: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12 గం. వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 10రోజుల్లో దర్శనానికి మొత్తం 180 గంటల సమయం ఉంటే.. దానిలో టీటీడీ సామాన్యులకే 164 గంటలు కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన తిరుమల ఆలయ ఫొటోలను పైన ఉన్న గ్యాలరీలో చూడొచ్చు.

News December 29, 2025

నాగర్‌కర్నూల్ మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

image

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 36,912 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 433 ఎస్సీ జనాభా 5,371గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.