News February 11, 2026
కామారెడ్డి జిల్లాలో పోలింగ్ సరళి ఏవిధంగా ఉందంటే!

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో 92 వార్డుల్లో 1,49,525 మంది ఓటర్లున్నారు. జిల్లాలో పోలింగ్ సరళి ఉదయం మందకోడిగా సాగిన, పోలింగ్ ముగిసే సమయానికి పుంజుకుంది.
ఉదయం 9గం.లకు 6%
ఉదయం 11గం.లకు 26.86%
మధ్యాహ్నం 1గం.లకు 47.13%
సాయంత్రం 3గం.లకు 59.90%
పోలింగ్ పూర్తయ్యేసరికి 69.48%గా నమోదయ్యాయి.
Similar News
News February 12, 2026
NTR: ఎమ్మెల్యే కొలికపూడికి హెచ్చరిక

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అసెంబ్లీ లాబీలో భేటీ అయ్యారు. పార్టీ క్రమశిక్షణపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తన అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరిగాయని కొలికిపూడి వివరణ ఇచ్చి, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కోరినట్లు సమాచారం.
News February 12, 2026
విశాఖలో మురికివాడల అభివృద్ధే లక్ష్యం

విశాఖలో మురికివాడల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. RKబీచ్-రుషికొండ వరకు 6 సులభ్ కాంప్లెక్స్లు.. వెలంపేట, ఇందిరానగర్లో పైలట్ ప్రాజెక్టుల కింద గృహ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
News February 12, 2026
పొదలకూరులో పెరిగిన నిమ్మ ధరలు

పొదలకూరు నిమ్మ మార్కెట్లో ధరలు ఊపందుకున్నాయి. నేడు నాణ్యమైన నిమ్మకాయలు కేజీకి రూ.50 నుంచి రూ.65 వరకు పలికినట్లు రైతులు తెలిపారు. గత నెలలో కేజీకి రూ.6 నుంచి రూ.10 మాత్రమే రావడంతో రైతులు నష్టపోయారు. కాయలను చెట్లకే వదిలేశారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మార్కెట్ పరిధిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతోంది.


