News January 29, 2026
కామారెడ్డి జిల్లాలో రెండో రోజు 348 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో రెండో రోజు 348 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 203 (కాంగ్రెస్ 86, BRS 45, BJP 51, JS 6, TRP 2, AIMIM 1, CPM 1, IND 11), బాన్సువాడలో 87 (కాంగ్రెస్ 54, BRS 20, BJP 12, AIMIM 1, IND 3), ఎల్లారెడ్డిలో 24 (కాంగ్రెస్ 9, BRS 6, BJP 7, IND 2), బిచ్కుందలో 34 (కాంగ్రెస్ 9 , BRS 11, BJP 4,IND 10) చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News February 6, 2026
ఇంకా చూడాల్సింది.. జయించాల్సింది చాలా ఉంది మిత్రమా!

సాఫ్ట్వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏ సమస్యకైనా సూసైడ్ పరిష్కారం కాదని, పోరాడి సాధించాల్సింది ఎంతో ఉందని అంతా గుర్తుంచుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేయాలి. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సైకాలజిస్టులను నియమించుకోవాలి. దీనిపై మీరేమంటారు?
News February 6, 2026
కశ్మీర్ మా దేశంలో భాగమవుతుంది: పాక్ ప్రధాని

కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమవుతుందని పాక్ PM షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, UNSC తీర్మానాలు అమలు చేయడమే J&K వివాదానికి సరైన పరిష్కారం. కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా POK అసెంబ్లీలో అన్నారు. గతేడాది జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ రాజుకుందని చెప్పారు. ఇండియా ప్రాక్సీ టెర్రర్ను ఎగదోస్తోందని ఆరోపించారు.
News February 6, 2026
జమ్మికుంట: భార్యాభర్తల గొడవ.. భర్త ఆత్మహత్య

భార్యాభర్తల మధ్య ఆర్థిక గొడవల కారణంగా జమ్మకుంటకు చెందిన భర్త సుద్దాల శ్రీనివాస్(39) మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ రామకృష్ణ గౌడ్ వివరాలిలా.. శ్రీనివాస్ భార్య మనమ్మ, భర్తకు తెలియకుండా తన సోదరికి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి ఆ సొమ్ము అడిగినా రాకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ లుంగీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.


