News February 19, 2025

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టర్లతో మంగళవారం CS శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 17 హాబిటేషన్స్‌లో తాగు నీటి సమస్య ఉందని, ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్‌కు సంబంధించి రోజువారి రిపోర్టులు ఇవ్వాలన్నారు. 

Similar News

News December 15, 2025

రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

image

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్‌ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.

News December 15, 2025

సూర్యాపేట: ఒక్క ఓటు తేడాతో BRS మద్దతుదారు గెలుపు

image

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం భక్తలాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితం చివరి వరకూ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు BRS బలపరిచిన అభ్యర్థి జుట్టుకొండ గణేశ్ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. సంచలన విజయం సాధించడంతో BRS శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గణేశ్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు.

News December 15, 2025

శంకర్‌పల్లి: పల్లె లత యాదిలో గెలిపించారు!

image

గుండెపోటుతో మరణించిన మాసానిగూడ గ్రామ 8వ వార్డు మెంబర్ అభ్యర్థిని పల్లె లత (42)ను వార్డు ప్రజలు గెలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురికాగా కుటుంబీకులు శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయగా చికిత్స పొందుతూ డిసెంబర్ 7న మృతి చెందారు. కాగా, నేటి ఫలితాల్లో ఆమెకు 30 ఓట్ల ఆధిక్యం వచ్చింది.