News December 17, 2025

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21.49% పోలింగ్

image

కామారెడ్డి జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 40,890 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు ఆయా మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
బాన్సువాడ-19.90%
బీర్కూర్-18.23
బిచ్కుంద-27.70%
పెద్దకొడప్గల్-27.15%
మద్నూర్-14.70%
డోంగ్లి-25.43%
జుక్కల్-21.07%
నస్రుల్లాబాద్-21.90%
పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News December 18, 2025

కాల సర్ప దోషం ఎలా ఏర్పడుతుంది?

image

జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు (రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని) ఉంటే దానినే కాల సర్ప దోషం అంటారని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రకాల కాల సర్ప దోషాలు ఉంటాయట. ప్రతి దానికీ వేర్వేరు ప్రభావాలు, నివారణలు ఉన్నాయంటున్నారు. రాహుకేతువులు లగ్నం 1, 2, 7, 8వ స్థానాల్లో ఉంటే దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వీటికి నివారణ మార్గాలున్నాయని వివరిస్తున్నారు.

News December 18, 2025

NGKL: రేషన్ కార్డుదారులు e-KYC చేసుకోండి

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని రేషన్ కార్డు దారులు జాతీయ ఆహార భద్రత పథకం(NFSA) కింద 100% ఈ కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం జిల్లాలో 8,80,058 లబ్ధిదారులకు గాను 6,28,315 లబ్ధిదారులు మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేయగా 2,51,743 లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. కేవైసీ పూర్తికాని పక్షంలో రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

News December 18, 2025

కడప జిల్లాలో లక్ష్యానికి దూరంగా AMCల రాబడి

image

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి 2025-26లో రూ.13.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి రూ.7.09 కోట్లు (52.44%) మాత్రమే వసూలైంది (రూ.కోట్లలో). కడప – 1.54, ప్రొద్దుటూరు – 0.71, బద్వేల్ – 1.20, జమ్మలమడుగు – 0.42, పులివెందుల – 0.67, మైదుకూరు – 1.44, కమలాపురం – 0.44, సిద్దవటం – 0.13, ఎర్రగుంట్ల – 0.38, సింహాద్రిపురం – 0.12 మాత్రమే వసూలైంది.