News January 25, 2026

కామారెడ్డి: ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు జిల్లా వాసి

image

నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు దేశ రాజధాని ఢిల్లీలో 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆయనకు పిలుపు రావడంతో శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కమ్మరి రాజు ఒక్కరు ఉండటం విశేషం.

Similar News

News April 13, 2026

నెల్లూరులో సిటీ బస్సులు.. ట్విస్ట్ ఇదే!

image

నెల్లూరులో <<19612409>>సిటీ బస్సులు <<>>తిప్పుతామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వీటికంటూ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే బస్సులకే టౌన్ స్టాఫింగ్‌ ఇచ్చారు. వాటిపై పల్లెటూరి పేర్లు ఉండటంతో టౌన్ బస్సులని చాలామందికి తెలియడం లేదు. వీటిని ఎవరూ ఆపడం లేదు. ప్రత్యేక బస్సులు వేయడం లేదా పల్లెటూర్ల వాటికే టౌన్ సర్వీసులు అని తెలిసేలా బోర్డులు పెడితే బాగుంటుంది.

News April 13, 2026

మే 13 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

image

జిల్లాలో ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రథమ సంవత్సరంలో 66.20%, ద్వితీయ సంవత్సరంలో 70.58% ఉత్తీర్ణత నమోదైంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలను మే 22 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించారు.

News April 13, 2026

సూర్యాపేట: అన్నదమ్ములు అదరగొట్టారు

image

మఠంపల్లి మండలం మంచ్యాతండాకు చెందిన అన్నదమ్ములు గౌతమ్ నాయక్, మనోజ్ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవి నాయక్ కుమారులైన వీరిలో గౌతమ్ ద్వితీయ సంవత్సరంలో 988/1000 మార్కులు, మనోజ్ ప్రథమ సంవత్సరంలో 467/470 మార్కులు సాధించారు. ఒకే ఇంట్లో ఇద్దరు టాపర్లుగా నిలవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.