News October 25, 2025

కామారెడ్డి: తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా భాజా లలిత

image

కామారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ నాయకురాలు భాజా లలితను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యరు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత శుక్రవారం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. భాజా లలిత మాట్లాడుతూ.. జిల్లాలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News October 25, 2025

నాగుల చవితి రోజున చదవాల్సిన మంత్రాలు

image

నాగుల చవితి రోజున ‘ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్’ శ్లోకాన్ని జపిస్తే.. భక్తులు ముక్తిని, మోక్షాన్ని, నాగరాజు ఆశీస్సులను పొందుతారని పండితులు చెబుతున్నారు. పుట్టలో పాలు పోసేటప్పుడు ‘సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే.. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ శ్లోకాన్ని పఠిస్తే.. సర్పాలు సంతృప్తి చెందుతాయని నమ్మకం.

News October 25, 2025

సిరిసిల్ల: అత్యధికంగా ముస్తాబాద్లో..

image

జిల్లాలోని ముస్తాబాద్లో అత్యధికంగా 19.5, అత్యల్పంగా వేములవాడ రూరల్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇల్లంతకుంట 13.8, ఎల్లారెడ్డిపేట 13.3, రుద్రంగి 9.5, ఇల్లంతకుంట 5.5, కోనరావుపేట 5.3, సిరిసిల్ల 3.5, చందుర్తి 3.5, వేములవాడ 3.3, గంభీరావుపేట 2.3, తంగళ్ళపల్లి 2, బోయినపల్లిలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 25, 2025

నిర్మల్: ఈనెల 26 వరకు గడువు పొడగింపు

image

అంతర్-జిల్లా డిప్యుటేషన్ కోసం దరఖాస్తు గడువును ఎడిట్ ఆప్షన్‌తో సహా ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు 25 నుంచి 26వ తేదీ లోపు ఎడిట్ చేసి సమర్పించవచ్చని అలాగే కొత్తగా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.