News May 21, 2024

కామారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ తెలిపారు. 3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జూన్ 6లోగా ధృవీకరణ పత్రాలు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

Similar News

News February 27, 2026

NZB: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

image

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైందని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, మార్చి13 నుంచి 17 వరకు మండల, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయని ఆయన తెలిపారు. నేటి నుంచి మార్చి 4 వరకు https:///tgss.telangana.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.

News February 27, 2026

ముప్కాల్: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

image

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 27, 2026

NZB: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో “మనా ఇసుక వాహనం” యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.