News February 20, 2025
కామారెడ్డి: నరేందర్ రెడ్డిని గెలిపించాలి: MP

కామారెడ్డి సత్యాగార్డెన్లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలో ఏకంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మెదక్, NZB, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.
Similar News
News September 19, 2025
సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.
News September 19, 2025
వృద్ధుల సంక్షేమంపై ములుగు ఆర్డీఓ కీలక సూచనలు

వయోవృద్ధులు తమ ఆస్తిని బదలాయించేటప్పుడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ‘పోషణ, సంక్షేమం’ నిబంధనలను తప్పకుండా పొందుపరచాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. ఆస్తి పొందినవారు నిబంధనలు పాటించకపోతే, వృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఆస్తిని రద్దు చేసే అధికారం ఉంటుందని తెలిపారు.
News September 19, 2025
మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.