News October 30, 2024

కామారెడ్డి: ‘నవంబర్ 9, 10వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు’

image

నవంబర్ 9, 10 వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లోని బిఎల్ఓ లకు ఆఫ్ లైన్ ద్వారా అర్హత గల యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవచ్చును.

Similar News

News February 20, 2026

బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

image

నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

News February 20, 2026

NZB: నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఆరాటం

image

మార్చి15లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసంతృప్తులకు, రెబల్స్‌కు నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు, భరోసాను కల్పించారు. ఈ నేపథ్యంలో భర్తీ ప్రకటన వెలువడడంతో వారిలో ఆశలు మొదలయ్యాయి. కాగా DCCB ఛైర్మన్ పదవిని పురన్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం.

News February 20, 2026

నిజామాబాద్ కా ‘రాణి’..!

image

మున్సిపల్ ఎన్నికల వరకు ఆమె ఓ సాధారణ మహిళ. రాజకీయాలు అస్సలు తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో NZB 49వ డివిజన్ నుంచి ఆమెకు కాంగ్రెస్ టికెట్ లభించింది. కనీసం ప్రచారంలో సైతం పేరు వినిపించని ఆమె గెలుపొంది అనూహ్యంగా నగర ప్రథమ పౌరురాలి స్థానం పొందారు. ఆర్మూర్‌కు చెందిన జర్నలిస్ట్ బెడిద రాజేశ్వర్‌రావు కూతురు, కరాటే రమేశ్ భార్య ఉమారాణి. నేడు ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.