News December 31, 2025
కామారెడ్డి: న్యూ ఇయర్.. చికెన్, ఫిష్ మార్కెట్లలో సందడి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. 2026కు స్వాగతం పలికేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. దీంతో బుధవారం కామారెడ్డి జిల్లాలోని చికెన్, ఫిష్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డిమాండ్కు అనుగుణంగా చేపల ధరలు సాధారణం కంటే అధికంగా పలికాయి. అయినప్పటికీ పండుగ జోష్లో ప్రజలు కొనుగోలుకు వెనుకాడలేదు. మీ ప్రాంతంలో కొత్త ఏడాది వేడుకల సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 8, 2026
ఆ వార్త చదివి గుండె బద్దలైంది: శిఖర్ ధావన్

బంగ్లాదేశ్లో హిందూ మహిళపై సామూహిక దాడి ఘటనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ వార్త చదివి గుండె బద్దలైంది. ఎవరిపైన అయినా, ఎక్కడైనా హింస ఆమోదయోగ్యం కాదు. బాధితురాలికి న్యాయం జరగాలి” అని ట్వీట్ చేశారు. కాగా ఇద్దరు వ్యక్తులు ఓ 40 ఏళ్ల హిందూ వితంతువును రేప్ చేసి, ఆమె జుట్టు కత్తిరించి, చెట్టుకు కట్టేసి టార్చర్ చేశారు. ఈ వీడియో SMలో <<18770990>>వైరల్<<>> అవుతోంది.
News January 8, 2026
ప్రపంచ పర్యాటక కేంద్రంగా సూర్యలంక బీచ్: కలెక్టర్

సూర్యలంక బీచ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు స్వదేశీ దర్శన్ 2.O కింద రూ.97 కోట్లతో పనులు ప్రారంభించామని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. బీచ్లో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
పనుల వేగం, నాణ్యతపై సూచనలు చేశారు. పనులన్నీ సెప్టెంబర్లోపు పూర్తి చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఫిష్ ఆంధ్ర షాపుల సమస్యలు, గిరిజనుల పునరావాసంపై న్యాయం చేస్తామన్నారు.
News January 8, 2026
పవన్ వద్ద పంచాయితీ.. సదుం వాసుల వాదన ఇది.!

సదుంలో మైనింగ్ కోసం సేకరించిన<<18792414>> భూముల్లో<<>> అధికంగా డీకేటీ భూములు ఉండటంతో పరిహారం అంశం ప్రధాన సమస్యగా మారింది. భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా, పనులు ప్రారంభమైన తర్వాత పరిహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామ కమిటీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై రైతులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పష్టమైన పరిష్కారం కనిపించలేదని వారు అంటున్నారు.


