News February 5, 2025

కామారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!

image

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. కామారెడ్డి జిల్లాలో 536 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

Similar News

News November 5, 2025

పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.

News November 5, 2025

కార్తీక మాసం: ఉసిరి దీపం ఎందుకు పెడతారు?

image

ఉసిరి చెట్టు అంటే శివస్వరూపం. అందుకే కార్తీకంలో దానికి పూజలు చేస్తారు. దీని కింద దీపం పెడితే సకల కష్టాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శివ పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం పెడితే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి.. ఈ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవీ ఆర్థిక బాధలన్నీ తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శుభప్రదం.

News November 5, 2025

తెనాలి: వ్యభిచార గృహం నిర్వహిస్తున్న భార్యాభర్తల అరెస్ట్

image

తెనాలి మండలం కఠెవరం పంచాయతీ పరిధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న షేక్ గపూర్ అతని రెండవ భార్య దుర్గా భవానీని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు డబ్బులు ఆశ చూపి ఆమెతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా..14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మహిళను స్వధార్ కేంద్రానికి పంపించినట్లు ఎస్ఐ వెల్లడించారు.