News April 7, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 73 ఫిర్యాదులు

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన 73 దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల సమస్యలు, రెండు పడకగదుల ఇళ్లు, రైతు భరోసా, పింఛన్లు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News April 12, 2025
SSMB29 రిలీజ్ ఎప్పుడంటే?

రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 25 లేదా 27న రిలీజ్ చేస్తారని టాక్. దీంతో మహేశ్, రాజమౌళి సృష్టించే రికార్డుల విధ్వంసం కోసం ఎదురుచూస్తామని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News April 12, 2025
KKR చేతిలో ఓటమిపై ధోనీ ఏమన్నారంటే?

కేకేఆర్ చేతిలో ఓటమిపై సీఎస్కే కెప్టెన్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు పడటం ఇతర బ్యాటర్లపై ప్రభావం చూపిందన్నారు. సరిపోయేంత రన్స్ కొట్టలేదని భావిస్తున్నట్లు తెలిపారు. సవాల్ను స్వీకరించి పరుగులు రాబట్టేందుకు మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. వెంట వెంటనే వికెట్లు పడటంతో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోయామన్నారు.
News April 12, 2025
సెక్షన్-111 పెట్టడంపై జడ్జి ఆగ్రహం.. అసలేంటిది?

ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే.. అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. BNSలోని సెక్షన్-111(1) వ్యవస్థీకృత నేరాన్ని సూచిస్తుంది. కిడ్నాప్, దొంగతనం, వాహనాల చోరీ, భూకబ్జా మొదలైన నేరాలు దీని కిందకు వస్తాయి. తాజాగా వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16067210>>కిరణ్పై<<>> పోలీసులు ఈ కేసు పెట్టడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.