News December 21, 2025
కామారెడ్డి: ఫుడ్ సేఫ్టీపై రెజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా

కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 22న ఆహార భద్రత రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు డెసిగ్నేటెడ్ అధికారి శిరీష తెలిపారు. ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో తగిన పత్రాలతో ఈ మేళాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆమె హెచ్చరించారు.
Similar News
News January 7, 2026
కామారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

కామారెడ్డి జిల్లాలో MROలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిట్లం MRO నరేందర్ బాన్సువాడకు బదిలీ అయ్యారు. బాన్సువాడ MRO వరప్రసాద్ కలెక్టరేట్ సూపరిండెంట్గా, మహేందర్ పిట్లం MROగా నియమితులయ్యారు. నిజాంసాగర్ MRO భిక్షపతిని పెద్దకొడప్గల్కు బదిలీ చేయగా, ఇన్ఛార్జిగా ఉన్న అనిల్ కుమార్ ఎల్లారెడ్డి RDO కార్యాలయానికి వెళ్లారు. సవాయి సింగ్ను బీర్కూర్కు, భుజంగరావు నిజాంసాగర్కు బదిలీ అయ్యారు.
News January 7, 2026
ఖమ్మం సీపీఐ సభకు CM రేవంత్

సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకలకు ఖమ్మం వేదిక కానుంది. ఈనెల 18న స్థానిక ఎస్.ఆర్ & బీ.జీ.ఎన్.ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక సభలో సీఎం ప్రసంగించనున్నట్లు సీపీఐ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News January 7, 2026
సంగారెడ్డి: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు.


