News November 13, 2025
కామారెడ్డి: బీసీ ఆక్రోశ సభకు మద్దతు ప్రకటించిన ఎలక్ట్రిసిటీ యూనియన్

కామారెడ్డిలో శనివారం జరగనున్న BC ఆక్రోశ సభకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం వారు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆహ్వాన కమిటీ ఛైర్మన్ మర్కంటి భూమన్న కో ఛైర్మన్లు క్యాతం సిద్ధ రాములు, బాలార్జున్ గౌడ్ సమక్షంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 42% BC రిజర్వేషన్ల సాధన కోసం నిరంతరం పోరాడుతామన్నారు.
Similar News
News November 14, 2025
మడ్చల్: ఎర్రజెండాతోనే సమస్యల పరిష్కారం: MLA

భారత దేశంలో ప్రత్యామ్నాయం కమ్యూనిజమేనని, ప్రజా సమస్యల పరిష్కారం ఎర్రజెండాలతోనే సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమితి సమావేశం ఈసీఐఎల్లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరగగా, కూనంనేని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
News November 14, 2025
కొత్తగూడెం: జాతీయ స్థాయిలో సింగరేణికి అవార్డు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనకు అందజేశారు. కోల్ ఇండియాతో పాటు ఇతర గనుల సంస్థల నుంచి సింగరేణి ఈ గుర్తింపు సాధించింది.
News November 14, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ జిల్లాలో 83,850 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్
✓ గ్రంథాలయ పన్నులు సకాలంలో చెల్లించాలి: అ.కలెక్టర్
✓ మణుగూరు: ట్రాఫిక్ జాం.. 4KM నడిచిన విద్యార్థులు
✓ పాల్వంచ: హెల్త్ సెంటర్ను తనిఖీ చేసిన DMHO
✓ విద్యార్థులు ట్రైబల్ మ్యూజియం సందర్శించాలి: ఐటీడీఏ పీఓ
✓ ఉపకార వేతనాల కోసం బీసీ విద్యార్థులు అప్లై చేసుకోండి
✓ దుమ్ముగూడెం: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు


