News October 13, 2025
కామారెడ్డి: మద్దతు ధర పోస్టర్ల ఆవిష్కరణ

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన మద్దతు ధర పోస్టర్లను సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ విడుదల చేశారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
BREAKING: HYD: కత్తితో బెదిరించి బాలుడిపై లైంగిక దాడి

HYDలో అబ్బాయిలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సైదాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరువక ముందే తాజాగా బండ్లగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ PS పరిధిలో కత్తితో బెదిరించి నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడు. నొప్పితో బాధపడుతున్న బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News October 13, 2025
BREAKING: HYD: కత్తితో బెదిరించి బాలుడిపై లైంగిక దాడి

HYDలో అబ్బాయిలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సైదాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరువక ముందే తాజాగా బండ్లగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ PS పరిధిలో కత్తితో బెదిరించి నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడు. నొప్పితో బాధపడుతున్న బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News October 13, 2025
వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.