News January 18, 2026
కామారెడ్డి: మున్సిపల్ టికెట్ల రేసులో ‘యువ’ గళం!

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ కంటే యువత, విద్యావంతుల వైపే రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటడం, రిజర్వేషన్లతో మహిళల వాటా పెరగడంతో ఈసారి మున్సిపల్ పగ్గాలు కొత్త తరం చేతికి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Similar News
News February 11, 2026
PDPL: ‘స్ట్రాంగ్ రూమ్కు చేరేవరకు అప్రమత్తంగా ఉండాలి’

పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ వరకు చేరేవరకు పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని PDPL- DCP రామ్ రెడ్డి సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. GDK-1, 2 టౌన్, మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భద్రత ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటర్లకు సౌకర్యాలు తదితర విషయాలపై సమీక్షించారు.
News February 11, 2026
రాహుల్ ఆరోపణలకు హర్దీప్ సింగ్ కౌంటర్

లోక్సభలో LoP రాహుల్ గాంధీ తనపై చేసిన <<19111987>>వ్యాఖ్యలన్నీ<<>> అబద్ధాలేనని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కొట్టిపారేశారు. ‘3 లక్షల ఈమెయిల్స్లో నా గురించి 4 లైన్లే ఉంది. మేకిన్ ఇండియా చర్చల్లో భాగంగా అతనితో పలుమార్లు భేటీ అయ్యా. మా మధ్య ఒక మెయిల్ సంభాషణే ఉంది’ అని అన్నారు. గతంలో రాహుల్ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు కూడా అబద్ధమని తేలాయని పురి విమర్శించారు.
News February 11, 2026
సాగర మిత్రల సేవలు కొనసాగించండి: వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో మత్స్యశాఖ కింద పని చేస్తున్న సాగర్ మిత్రల సేవలను కొనసాగించాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సాగర్ మిత్రులు గ్రామాలలో ఎన్నో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను మరింత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.


