News September 20, 2024
కామారెడ్డి: మెగా అదాలత్ను వినియోగించుకోవాలి: ఎస్పీ
ఈనెల 28 జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సింధుశర్మ అన్నారు. రాజీపడ దగిన కేసులలో జిల్లాలోని అన్ని కోర్టులో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారించుకోవచ్చని ఆమె సూచించారు.
Similar News
News September 20, 2024
నిజామాబాద్: పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు మేలు: సీపీ
నిరంతరం వార్తలు రాసే పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు ఉపయోగపడే వీలుంటుందని సీపీ కల్మేశ్వర్ అన్నారు. నిజామాబాద్లో నూతన న్యాయ చట్టాలపై శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు చట్టాలను తమ చేతుల్లో లోకి తీసుకోవద్దని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. వీడీసీల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 20, 2024
KMR: ఇలాంటి పురాతన బావులు మీ ఊరిలో ఉన్నాయా.. కామెంట్..!
లింగంపేటలోని నాగన్న మెట్ల బావిని నేడు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. కాగా ఈ బావికి చాలా ప్రత్యేకతలున్నాయి. పాపన్నపేట సంస్థాన కాలంలో జాక్సాని నాగన్న అనే వ్యక్తి 18 వ శతాబ్దంలో నిర్మించాడని స్థానిక కైఫియత్తులో లిఖించబడింది. ఈ నిర్మాణాన్ని ఉపరితలం నుంచి 100 అడుగుల లోతు వరకు ఐదు అంతస్తులుగా రాతితో అందంగా నిర్మించారు. మరీ ఇలాంటి పురాతన బావులు మీ గ్రామంలో ఉన్నాయా.. ఉంటే కామెంట్ చేయండి
News September 20, 2024
NZB: డాక్టర్ పేరిట GGHలో రూ.90 వేల నూతన ఫోన్ అపహరణ
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో డాక్టర్ పేరిట రూ.90 వేలు విలువ చేసే కొత్త ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. నగరంలోని ఒక సెల్ ఫోన్ షాపుకు డాక్టర్ పేరిట ఫోన్ చేసి GGHకు ఫోన్ తెస్తే తీసుకుంటానని నమ్మబలికి రప్పించి సూపరింటెండెంట్ రూం ఎదురుగా కూర్చోబెట్టాడు. లోపల సార్కు ఫోన్ చూయించి వస్తానని ఫోన్తో సహా పరారయ్యాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.