News September 23, 2025
కామారెడ్డి: మేఘమా శాంతించుమా

కామారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నుంచి ఒక్కసారిగా కుండపోత వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. నెల రోజుల క్రితం ‘మేఘమా వర్షించుమా’ అని ఆకాశం వైపు చూసిన అన్నదాతలు, ఇప్పుడు ‘మేఘమా శాంతించుమా’ అంటూ మొర పెట్టుకుంటున్నారు. పక్షం రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలకు జిల్లా అతలాకుతలం అయ్యింది. సోమవారం మళ్లీ పలుచోట్ల భారీ వర్షంతో తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Similar News
News September 23, 2025
నల్గొండ సీపీఓగా ఆర్డీవో అశోక్ రెడ్డి అదనపు బాధ్యతలు

నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి సోమవారం నల్గొండ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా (సీపీఓ) అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీపీఓగా బాధ్యతలు నిర్వహించిన సూర్యాపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్. కిషన్ అందుబాటులో ఉండకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయన్ను తొలగించారు. దీంతో ప్రస్తుత సీపీఓగా ఆర్డీవో అశోక్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 23, 2025
కరీంనగర్: భూతల్లే వారికి డైనింగ్ టేబుల్..!

పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీలకు పొలం పక్కన ఉన్న రోడ్డే డైనింగ్ టేబుల్ అయింది. ఉదయం నుంచి అలుపెరగకుండా శ్రమించిన వీరు.. మధ్యాహ్నం వేళ రోడ్డు పక్కనున్న చెట్టు కింద సేదతీరుతూ తెచ్చుకున్న సద్ది బువ్వను తిన్నారు. కష్టానికి అలసట తెలియదు, కన్నీళ్లకు బాధ ఉండదు అన్నట్లుగా తమ నిరాడంబరమైన జీవనశైలితో శ్రమజీవుల కష్టానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ దృశ్యం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూర్లో కన్పించింది.
News September 23, 2025
డిగ్రీ కాలేజీల బంద్ కొనసాగుతుంది: ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్

AP: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనందుకు నిరసనగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా 70% కాలేజీలు మూసివేసినట్లు ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 27వరకు కాలేజీల బంద్ కొనసాగుతుందని ప్రకటించింది. OCT 6నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని వెల్లడించింది. గత 16 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొంది.