News December 20, 2025

కామారెడ్డి: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

image

కామారెడ్డి మండలం గర్గుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన అండర్-14, 17 విభాగంలో పాఠశాలలో చదువుతున్న బాలబాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్లయ్య తెలిపారు.

Similar News

News December 20, 2025

APPLY NOW: APEDAలో ఉద్యోగాలు

image

<>APEDA<<>> 5 AGM పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(అగ్రికల్చర్/హార్టికల్చర్/ప్లాంటేషన్/అగ్రికల్చర్ Engg./వెటర్నరీ సైన్స్/ఫుడ్ ప్రాసెసింగ్), MBA, డిగ్రీ(ఫారెన్ ట్రేడ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: apeda.gov.in

News December 20, 2025

పార్వతీపురం: నాణ్యమైన పోషకాహారం అందించడమే ప్రధాన లక్ష్యం

image

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు, గర్భిణులకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని, ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలన్నారు.

News December 20, 2025

కరీంనగర్ ఎస్ఆర్ఆర్ అధ్యాపకుడికి డాక్టరేట్ పట్టా

image

KNR నగరంలోని SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకుడు శంకరయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆయన ‘సింథసిస్ బయోలాజికల్ ఎవల్యూషన్ అండ్ మాలిక్యులర్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ న్యూ బెంజిమెడజోల్’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేశారు. కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు సురేందర్ రెడ్డి, సత్య ప్రకాష్, సంజీవ్ తదితరులు శంకరయ్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.