News April 6, 2025
కామారెడ్డి: రేపు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లు ప్రారంభం

కామారెడ్డి జిల్లాలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను సోమవారం ప్రారంభించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటిని ఫార్చునర్ ద్వారా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజన్ పౌల్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Similar News
News April 7, 2025
ఎలమంచిలి: నువ్వులో కొత్త వంగడాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు

ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కొత్త నువ్వు వంగడం వైఎల్ఎల్-149 ను రూపొందించారు. కేంద్ర విత్తన ఎంపిక కమిటీ ఈ వంగడం విడుదలకు ఆమోదం తెలిపినట్లు స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్త శిరీష ఆదివారం తెలిపారు. కొత్త నువ్వు వంగడం ఎకరానికి ఐదారు క్వింటాళ్ల అధిక దిగుబడి ఇస్తుందని ప్రయోగాత్మక సాగులో నిర్ధారణ అయిందన్నారు. విత్తిన 80 నుంచి 85 రోజుల్లో పంట కోతకు వస్తుందని అన్నారు.
News April 7, 2025
అనకాపల్లి జిల్లాలో యువకుడి హత్య

రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మేడివాడకి చెందిన కొలిపాక పవన్ కుమార్(22) హత్యకు గురై మరణించాడు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ, అనకాపల్లికి చెందిన క్లూస్ టీం ఘటనా స్థలం చేరుకొని హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఫోన్ కొనేందుకు ఆదివారం పవన్ రావికమతం వచ్చినట్లు తండ్రి త్రిమూర్తులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 7, 2025
CTలో చోటు దక్కకపోవడం నిరాశపరిచింది: సిరాజ్

ఛాంపియన్స్ ట్రోఫీలో తనకు చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని GT పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పారు. ‘టీమ్ ఇండియా తరఫున కంటిన్యూగా ఆడుతుండగా ఒక్కసారిగా డ్రాప్ చేయడంపై ఎన్నో డౌట్స్ వస్తాయి. అందుకే నా బలహీనతలపై దృష్టి పెట్టాను. ఫిట్నెస్, ఆటను మెరుగుపర్చుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ముందు రాణించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. నిన్న 4 వికెట్లతో సిరాజ్ SRHను దెబ్బతీశారు.