News March 2, 2026
కామారెడ్డి: లీగల్ ఎయిడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తిరిగి నగదు పొందెందుకు తక్షణ సహాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా సమీప పోలీస్ స్టేషన్, లేదా జిల్లా సైబర్ క్రైమ్ సెల్ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 3, 2026
ప.గో: గ్యాస్ లీక్.. పరిస్థితి విషమం

పెనుగొండ మండల శివాలయం సమీపంలో సోమవారం రాత్రి వంట గ్యాస్ లీకై నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులు తమ్మ నాగేశ్వరరావు, లక్ష్మి, సమతం మణి, పల్లవిగా గుర్తించారు. వీరిలో మణి పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తహశీల్దార్ అనితకుమారి బాధితులను పరామర్శించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
News March 3, 2026
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే ఆస్కారముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38°C నమోదైంది.
News March 3, 2026
భోగాపురం: కోస్టల్ కారిడార్పై మల్లగుల్లాలు..

భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు VMRDA ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్పై సమీక్ష జరిగింది. ఎయిర్పోర్ట్ అనుసంధాన మార్గాలు, విశాఖ పోర్టు నుంచి విమానాశ్రయం వరకు కొస్టల్ కారిడార్ ప్రతిపాదనపై MPలు, MLAలు, విశాఖ, విజయనగరం కలెక్టర్లు చర్చించారు. అమలుపై ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు, సూచనలు చేశారు. భూసేకరణ, మార్గ రూపకల్పన అంశాల్లో స్పష్టత అవసరమని అభిప్రాయపడినట్టు తెలిసింది.


