News September 4, 2025
కామారెడ్డి: వరద నష్టంపై సీఎంకు కలెక్టర్ ప్రజెంటేషన్

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. IDOCలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంటలు, రోడ్లు, ఇళ్లు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టాలను వివరించారు. వర్షాల వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన అంచనాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా అందజేశారు.
Similar News
News September 5, 2025
గణేశ్, మిలాద్-ఉన్-నబీ భద్రతపై సీపీ సమీక్ష

హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ నగరంలో జరగనున్న గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీనియర్ అధికారులు, జోన్ డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 5న మిలాద్-ఉన్-నబీ, 6న ప్రధాన గణేశ్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్, ఎంజే మార్కెట్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బ్లూ కోర్టు మరియు పెట్రోలింగ్ బృందాలు నిఘాను పెంచాలని ఆదేశించారు.
News September 5, 2025
నేటి ముఖ్యాంశాలు

* వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ
* APలోని పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. క్యాబినెట్ నిర్ణయం
* SLBC పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించాం: భట్టి
* కలుషిత నీటితోనే తురకపాలెంలో మరణాలు: అంబటి
* భార్గవ్పై ఆరోపణలు అవాస్తవం: సజ్జల రామకృష్ణారెడ్డి
* హైదరాబాద్లో గణేశ్ లడ్డూకు రూ.51 లక్షల రికార్డు ధర
News September 5, 2025
రేపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖైరతాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మంత్రులు పొన్నం, సురేఖ కూడా వెళ్తారు. కాగా శనివారం మహాగణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఇవాళ రాత్రి 12 గంటల నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.