News February 11, 2025

కామారెడ్డి: విద్యాశాఖ మంత్రిని నియమించాలి: SFI

image

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డిలో జిల్లా ఎస్ఎఫ్ఐ ఐదో మహాసభ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్, నాయకులు రాహుల్, నితిన్ మణికంఠ, నవీన్ ఉన్నారు.

Similar News

News November 12, 2025

FLASH: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.

News November 12, 2025

విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి: కలెక్టర్

image

నూతన విద్యా విధానం డిజిటల్ తరగతులు ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా విద్యార్థులకు అవసరమైన విద్య బోధనలు, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. నెల్లికుదురు మండలంలోని కేజీబీవీనీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టోర్ గది, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ శానిటేషన్‌లపై అవగాహన కల్పించాలన్నారు.

News November 12, 2025

పుట్టపర్తికి రాష్ట్రపతి, ప్రధాని రాక

image

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్నారు. 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్‌లు, దేశవిదేశీ వీవీఐపీలు రానున్నారు. ఈ నెల 13 నుంచి 23 వరకూ పది రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు.