News February 25, 2025

కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు. 

Similar News

News December 30, 2025

మీ పార్టీలు సరే.. ఇంట్లో వాళ్ల సంగతేంటి?

image

కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. న్యూఇయర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ధూంధాం పార్టీలుంటాయి. పబ్బులు, బార్లు, దోస్తులతో DEC 31st నైట్‌ ఎంజాయ్ చేస్తారు. పురుషులంతా వారి ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ కూడా చేసుకుని ఉంటారు. అయితే ఇంట్లో ఉండే వాళ్ల సంగతేంటి? అదే ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి, భార్య.. వాళ్లకి కూడా కొత్త సంవత్సరమే కదా. వారి గురించి ఏమైనా ఆలోచించారా?

News December 30, 2025

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.1,15,42,056

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామివారికి 49 రోజుల్లో రూ.1,15,42,056 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.వెంకటేశ్ తెలిపారు. 60 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 50విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈకార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News December 30, 2025

సంగారెడ్డి జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

image

సంగారెడ్డి జిల్లాలో 4,766 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సహకార సంఘాల వద్ద 444 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,819 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పూర్తి స్థాయి యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.