News September 19, 2025

కామారెడ్డి: స్త్రీ నిధి రాష్ట్ర బోర్డు కోశాధికారిగా స్రవంతి

image

బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి స్త్రీ నిధి రాష్ట్ర బోర్డు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌ను కలిశారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పదవికి ఎంపికైనందుకు కలెక్టర్ ఆమెను అభినందించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమెకు సూచించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప రాణి, అడిషనల్ డీఆర్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

ములుగు: ‘అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలి’

image

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ డాక్టర్ వి.బాలకిష్టారెడ్డి సూచించారు. ఉద్యానవర్సిటీ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని అయితే అన్ని దేశాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా ఏకకాలంలో జరిగేటట్టు చూసుకోవాలన్నారు.

News September 19, 2025

ఆదిలాబాద్: ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

image

ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్ ఎస్పీగా పదోన్నతి రాగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన కాజల్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.

News September 19, 2025

వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

image

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.