News August 14, 2024
కామారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కౌలాస్ ఖిల్లా సిద్ధం

కామారెడ్డి జిల్లాలోని శతాబ్దాల చరిత్ర కలిగిన కౌలాస్ ఖిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఈ కోటకు పునర్వైభవం తీసుకురావాలనే సంకల్పంతో చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా గణతంత్ర దినోత్సవం నాడు తొలిసారిగా కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక రేపు గురువారం పంద్రాగస్టు వేడుకలు కోటలో ఘనంగా జరగనున్నాయి. మరోసారి కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది.
Similar News
News November 11, 2025
NZB: ఢిల్లీలో పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.
News November 10, 2025
TU అధికారులు వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలి: AISF

TUలో 2012లో ఉద్యోగ నోటిఫికేషన్లో జరిగిన నియామకాలను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును TU అధికారులు వెంటనే అమలు చేయాలని AISF యూనివర్సిటీ కన్వీనర్ సంజీవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ టీయూ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ వెంటనే స్పందించాలన్నారు.
News November 10, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన CP

నిజామాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు, మహిళా కానిస్టేబుల్ను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. సాయి నగర్-2 నుంచి హోంగార్డ్ అల్లం భూమయ్య ఆయన కూమర్తె మహిళా కానిస్టేబుల్ అల్లం మాధురిని నిన్న రాత్రి బైక్పై విధులకు తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


