News February 13, 2025
కామారెడ్డి: హాస్టల్లో ఉండటం ఇష్టం లేక పారిపోయిన విద్యార్థి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739445730940_51869222-normal-WIFI.webp)
సిరిసిల్ల గంభీరావుపేట మండలం గోరింటాకు చెందిన శివరామకృష్ణ అనే బాలుుడు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హాస్టల్లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం అతని తల్లి హాస్టల్లో వదిలేందుకు తీసుకు వెళ్తుండగా రైల్వే గేటు వరకు వచ్చి పారిపోయినట్లు ఆమె తెలిపింది. మిస్సింగ్ కేసును నమోదు చేసినట్లు కామారెడ్డి పోలీసులు పేర్కొన్నారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేక పారిపోయాడని బాలుని తల్లి చెప్పారు.
Similar News
News February 13, 2025
ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438307785_695-normal-WIFI.webp)
‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.
News February 13, 2025
BREAKING: తోటి సిబ్బందిపై CRPF జవాన్ ఘాతుకం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908589618-normal-WIFI.webp)
మణిపుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ అనే CRPF జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు చనిపోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనను తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
News February 13, 2025
రేపు నల్లగొండ జిల్లా బందును విజయవంతం చేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739457499245_18661268-normal-WIFI.webp)
రేపు నల్లగొండ జిల్లా బందును విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ నాయకులు రాజు గురువారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని గురువారం మాల మహానాడు జాతీయ నాయకులు రాజు మాట్లాడుతూ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు సంఘాలు బందుకు పిలుపునిచ్చాయని, ఈ బంధును విజయవంతం చేయాలన్నారు.