News February 16, 2025
కామారెడ్డి: 72 మందికి నియామక పత్రాలు

కామారెడ్డి జిల్లాకు చెందిన 72 మందికి డీఎస్సీ 2008 అభ్యర్థులకు శనివారం నియామక ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో 70 మందికి నియామకపు ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అందించారు. సోమవారం నుంచి వారికి కేటాయించిన పాఠశాలల్లో విద్యాబోధన చేస్తారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 38 గేట్లు ఎత్తివేత

గురువారం కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 62 గేట్లలో 38 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్సకారులు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News September 19, 2025
సిరిసిల్ల: పేకాటస్థావరంపై దాడులు.. ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట మం. వెంకటపూర్లో గురువారం రాత్రి పోలీసులు <<17757085>>పేకాటస్థావరంపై దాడులు<<>> చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చాకలి రాజయ్య(55) భయంతో పరుగులు తీశాడు. చీకటి పడ్డా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. ఈ క్రమంలో వాగు సమీపంలో రాజయ్య పడున్నాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. పరుగులు తీయడంతోనే రాజయ్య కుప్పకూలాడని, ఈ క్రమంలో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
News September 19, 2025
షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. మరిపెడ పట్టణంలోని మోడల్ స్కూల్ ను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం, హాస్టల్ గదులు, తరగతి గదులను, స్టాఫ్ రూం లను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. విద్యార్థుల్లోని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు.