News May 23, 2024

కారంచేడు: తిరుపతికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు

image

కారంచేడుకు చెందిన పొత్తూరి వెంకట శివసుబ్రహ్మణ్యం భార్య రేఖ ప్రియాంక(32), పిల్లలు నిక్షిత్ (5) తేజవర్ధన్ (3)తో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరు కుమారిడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కారులో తిరుమలకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం వారు తిరిగి హైదరాబాద్‌కు బుధవారం రాత్రి బయలుదేరారు. గురువారం వేకువజామున కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ ప్రియాంక మృతిచెందగా, సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News November 8, 2025

జిల్లా స్థాయి పోటీలకు మార్కాపురం విద్యార్థుల ఎంపిక

image

ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ అండర్-14 లో మార్కాపురం బాలురు సత్తా చాటారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న వి.మహేష్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించారు. ఎం. అజయ్ 400, 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు.

News November 8, 2025

ముండ్లమూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ముండ్లమూరు మండలం వేంపాడు-పోలవరం మధ్యలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అద్దంకి నుంచి వస్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్‌ను క్రాస్ చేసే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. చాట్ల వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, షేక్ సుభానిని 108లో అద్దంకి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 7, 2025

రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.