News April 9, 2025

కారు బోల్తా.. TU విద్యార్థిని మృతి

image

KMR జిల్లా గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన 5గురు HYD నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈఘటలో అంజలి పూజ మృతి చెందింది. అంజలి పూజ టీయూ సౌత్ క్యాంపస్‌లో చదువుకుంటోంది.

Similar News

News April 17, 2025

NZB: జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్

image

జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయ ఛాంబర్‌లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూల బొకేతో జ్ఞాపికను బహూకరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు.

News April 17, 2025

ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉంది: షబ్బీర్ అలీ

image

ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. వక్ఫ్‌ (సవరణ)చట్టం-2025 చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభించిందన్నారు.

News April 17, 2025

NZB: రెండు రోజులు జాగ్రత్త..!

image

గత వారం పదిరోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు నమోదవుతున్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనాలు సతమతమవుతున్నారు. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ మేరకు రేపు ఎల్లుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

error: Content is protected !!