News August 18, 2024
కార్యకర్త పాడె మోసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

రేణిగుంట మండల టీడీపీ సీనియర్ కార్యకర్త, యూనిట్ ఇన్ఛార్జ్ మునెయ్య అంత్యక్రియలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. అంతియ యాత్రలో ఆయన పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వరకు మోసి సానుభూతి తెలిపారు. మంచి కార్యకర్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News March 2, 2026
నేడు చిత్తూరు కలెక్టరేట్లో PGRS

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.
News March 1, 2026
చౌడేపల్లి: చిరుత దాడిలో దూడ మృతి

చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు. చిరుత పులి దాడి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
News March 1, 2026
PGRSను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.


