News March 12, 2025
కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై చర్చించారు. నిర్వహణపై బుధవారం ఉదయం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 9, 2026
విశాఖ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు

విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. కార్డిలియా క్రూయిజ్ షిప్ జూన్ 24న విశాఖకు చేరుకొని పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు ఐదు రోజుల సముద్ర విహార యాత్ర నిర్వహించనుంది. జులై 1, 8, 15 తేదీల్లో కూడా సేవలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, వినోద కార్యక్రమాలు వంటి సౌకర్యాలు ఉంటాయి.
News March 9, 2026
విశాఖ: విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్కు కాల్ చేయండి

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News March 8, 2026
విశాఖ ఏయూ అంబేడ్కర్ చైర్ ‘AgriAI’ పరికరం

విశాఖ ఏయూ అంబేద్కర్ చైర్ రూపొందించిన ‘AgriAI’ అనే వినూత్న పరికరాన్ని డైరెక్టర్ మనోజ్ తివారీ ప్రారంభించారు. ఇది IoT, AI సాంకేతికతతో పంటలను ఆశించే పురుగులను గుర్తించి, పంట స్థితిగతులను ఫొటోలతో సహా రైతులకు విశ్లేషిస్తుంది. LLM ఇంటిగ్రేషన్తో పనిచేసే ఈ పరికరం వ్యవసాయ క్షేత్రాల్లో విజయవంతంగా పరీక్షించబడింది, ఇది రైతులకు చీడపీడల నివారణలో ఎంతగానో తోడ్పడనుంది.


