News January 10, 2026

కాలుష్యంలో ఢిల్లీని దాటేసిన బర్నీహాట్

image

దేశంలో కాలుష్యానికి రాజధాని ఢిల్లీనే అనుకుంటే ఈసారి అస్సాంలోని బర్నీహాట్ పట్టణం అంతకు మించిపోయింది. ఢిల్లీని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. సీఆర్ఈఏ (Centre for Research on Energy and Clean Air) తాజా నివేదిక ప్రకారం పీఎం2.5, పీఎం10 స్థాయులు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 44% నగరాలు వాయు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. UPలో అత్యధికంగా 416 నగరాలు ఈ జాబితాలో నిలిచాయి.

Similar News

News February 12, 2026

రాహుల్ సభ్యత్వం రద్దుకై BJP MP తీర్మానం

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు BJP MP నిషికాంత్ దూబే తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరిగి, ప్రభుత్వం ఓటింగ్ పెడితే సభ్యత్వం కోల్పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా ఒక అంశం/అభిప్రాయం/నిర్ణయంపై చర్చించాలని సభ్యులు సొంతంగా ప్రవేశపెట్టే తీర్మానాలను స్వతంత్ర తీర్మానం (Substansive Motion) అంటారు. దీనిపై చర్చపై స్పీకర్‌దే తుది నిర్ణయం.

News February 12, 2026

కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం?

image

AP: ఎంపీ కేశినేని చిన్నీపై ఆరోపణలు, ప్రభుత్వంపై పరోక్ష విమర్శలతో తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు నిత్యం <<19095636>>వివాదాల్లో<<>> ఉంటున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. క్రమశిక్షణ దాటితే ఉరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరుగుతున్నాయని, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కొలికపూడి కోరినట్లు తెలుస్తోంది.

News February 12, 2026

సరికొత్త రోల్‌లో మైక్ టైసన్

image

జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సరికొత్త రోల్‌లో కనిపించనున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో ‘హెల్తీ ఈటింగ్’ అంబాసిడర్‌గా పనిచేయనున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా సోదరి ఊబకాయంతో 25 ఏళ్లకే మరణించింది. నేను కూడా బాల్యంలో జంక్ ఫుడ్ వల్ల 156KGల బరువుతో ఇబ్బందిపడ్డా. సూసైడ్ చేసుకోవాలనుకున్నా. మంచి ఆరోగ్యం కోసం అల్ట్రా ప్రాసెస్డ్ కాకుండా రియల్ ఫుడ్ తినండి’ అని పిలుపునిచ్చారు.