News February 5, 2025

కాళేశ్వరంలో కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన

image

కాళేశ్వరం గ్రామంలో గోదావరి తీరాన్ని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం పరిశీలించారు. కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా, ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. పలువురు ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

పాలకుర్తిలో నేడే శూర్పణఖ వేషధారణ

image

పాలకుర్తి మండల కేంద్రంలో మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని గౌడ కులస్థులు ఆదివారం నిర్వహించబోయే శూర్పణఖ వేషధారణ విశేషంగా ఆకట్టుకోబోతోంది. బండి కొండయ్య గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. డప్పు చప్పుళ్లతో, యువతీ యువకుల కేరింతలతో ఊరంతా దద్దరిల్లేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శూర్పణఖను దర్శించుకుని స్పర్శిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది ఆనవాయితీగా వస్తోంది.

News July 6, 2025

SRCL: వేములవాడలో విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

వేములవాడ పట్టణంలోని మటన్ మార్కెట్ ఏరియాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ప్రకారం.. దీటి వేణుగోపాల్- రాణి దంపతుల మొదటి కుమారుడు రోహిత్ (24) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

News July 6, 2025

రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

image

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.